వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదం: సిఐడికి అప్పగింత

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని గెలుపు బాటలో నడిపించిన నరేంద్ర మోడి రెండో సారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆదివారంనాడు ప్రమాణం చేశారు. మోడి చేత రాష్ట్ర గవర్నర్‌ సుందర్‌ సింగ్‌ భండారీ ప్రమాణం చేయించారు.

మోడి ఆర్భాటంగా ఏర్పాటయిన కార్యక్రమంలో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ, వేలాది మంది కార్యకర్తల, సానుభూతిపరుల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు జయలలిత (తమిళనాడు), బాబూలాల్‌ మరండీ (జార్ఖండ్‌), ఓం ప్రకాశ్‌ చౌతాలా (హర్యానా) ఈ కార్యక్రమానికిహాజరయ్యారు.

బిజెపి అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, గోద్రా సంఘటన అనంతరం మోడి భద్రతా సలహాదారుగా కొంత కాలం వ్యవహరించిన కె.పి.యస్‌. గిల్‌, బాలీవుడ్‌ నటులు జుహీ చావ్లా, శేఖర్‌ సుమన్‌, తదితరులు కూడా ఈ కార్యక్రమానికిహాజరయ్యారు.

సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోడితో పాటు తొమ్మండుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. క్యాబినెట్‌ మంత్రులుగా వజుభాయ్‌ వాలా,అశోక్‌ భట్‌, కౌశిక్‌ పటేల్‌, ఆనందిబెన్‌ పటేల్‌, నరోత్తమ్‌ పటేల్‌, రామన్‌లాల్‌ వోరా, భూపేంద్ర సిన్హ్‌ చుడసామ,ఐ.కె. జడేజా, మంగుభాయ్‌ పటేల్‌ ప్రమాణం చేశారు. బవు్‌క ఉఘాద్‌, దిలీప్‌ఠాకోర్‌, అనిల్‌ పటేల్‌, ప్రభాత్‌సిన్హ్‌ చౌహాన్‌, అమిత్‌షా, సౌరభ్‌ పటేల్‌ సహాయ మంత్రులుగా ప్రమాణంస్వీకారం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X