వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీని కుదిపేసిన నాగప్ప మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: మాజీ నాగప్ప మృతిఅంశం మంగళవారం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ రాజీనామా చేయాలని, నాగప్ప మృతిపై సిబిఐవిచారణకు ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

మంగళవారం ఉదయం సభ సమావేశం కాగానే బిజెపి సభ్యులుపెద్ద పెట్టున నినాదాలు చేశారు. నాగప్ప మృతికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ, హోం మంత్రి మల్లికార్జున్‌ కార్గే, ఆగ్రో- ప్రాసెసింగ్‌ మంత్రి రాజు గౌడ వెంటనే రాజీనామాల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈఅంశంపై చర్చకు అనుమతిస్తామని, కార్యక్రమాలు సజావుగా జరగనివ్వాలనిస్పీకర్‌ ఎం.వి. వెంకటప్ప చేసిన విజ్ఞప్తిని బిజెపి సభ్యులు పట్టించుకోలేదు. దీంతో మొదటఅర గంట పాటు సభను వాయిదా వేశారు. గంటన్నర తర్వాత తిరిగి సభ సమావేశమైంది. అప్పుడు కూడా బిజెపి సభ్యులు తమ పట్టువీడకపోవడంతోస్పీకర్‌ సభను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X