వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ ఆర్టిస్టు అచ్యుత్‌ హఠాన్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ టెలివిజన్‌ ఆర్టిస్టు, సినీ నటుడు అచ్యుత్‌గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన వయస్సు 41 యేళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మరణంతో టీవీ ఆర్టిస్టుల ప్రపంచం శోక సముద్రమైంది.

గురువారం మధ్యాహ్నం గుండె నొప్పితో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఎన్నో విజయవంతమైన టీవీ సీరియళ్ల ద్వారా అచ్యుత్‌ తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆయన నట జీవితం దూరదర్శన్‌లో ప్రసారమైన ఇంద్రధనుస్సు సీరియల్‌ ద్వారా ప్రారంభమైంది. ఆయన 20 యేళ్ల పాటు అనేక టీవీ సీరియళ్లలో నటించారు. యాభైకి పైగా సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఐదు సార్లు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును స్వీకరించారు. వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరు ఉంది.

అచ్యుత్‌ మృతదేహాన్ని హైదరాబాద్‌ చిక్కడపల్లిలో గల ఆయన ఇంటికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం రామానాయుడు కళ్యాణ మండపంలో ఉంచుతారు. అనంతరం బంజారాహిల్స్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X