వివాదంలో అరకు ఫెస్టివల్
విశాఖపట్నం: ఈ నెల 28 నుంచి జరగాల్సినఅరకు ఫెస్టివల్ నిరవధికంగా వాయిదా పడింది. గిరిజన సంస్కృతి పరిరక్షణ కమిటీ, ట్రైబల్ గెరిల్లా వంటి సంస్థల నుంచిపెద్ద ఎత్తున నిరసన రావడంతో ఫెస్టివల్ ను వాయిదా వేశారు. అయితే, ముఖ్య అతిథిగా రావాల్సిన ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ వల్లే ఈఫెస్టివల్ ను వాయిదా వేసినట్లు అధికారులు చెబుతున్నారు.అందాల ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులో గిరిజనులు అధికంగా నివసిస్తారు. ఈ ప్రాంతంలో పర్యాటక శాఖ ఏటాఅరకు ఫెస్టివల్ నిర్వహిస్తోంది.
ఈ ఏడాది ఫెస్టివల్ కు ఆరు లక్షలను కేటాయించింది ఆ శాఖ. అయితే, ఐటిడిఎ నిధుల నుంచి ఈఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారని గిరిజన సంస్కృతి పరిరక్షణ కమిటీ ఆరోపిస్తుంది. గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులనుఫెస్టివల్ పేరిట దుబారా చేస్తున్నారని వారు అడ్డు తగిలారు.
అదీకాకుండా, గిరిజన సంస్కృతిని ఈ టూరిజం కలుషితం చేస్తుందని వారుఅంటున్నారు. మరోవైపు, జనవరి మొదటివారంలో నిర్వహించనున్న జన్మభూమి పూర్తయ్యక, ఈఫెస్టివల్ నిర్వహిస్తామని అధికారులు చెపుతున్నారు.