వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఫరిధిని పెంచండి: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బిజిపి జాతీయ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి బాగున్నప్పటికీ, పార్టీ ఫరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రెండు రోజులుగావిశాఖపట్నంలో జరుగుతోన్న పార్టీ సమావేశాలకు వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రసంగించారు. గురువారంఅంతా సుదీర్ఘంగా రహస్యంగా చర్చలు సాగించిన బిజెపి నాయకులు శుక్రవారం కాసేపువిలేకరులతో మాట్లాడారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కార్యకర్తలతో చర్చించి ప్రణాళికబద్దంగా పార్టీ కార్యక్రమాలను రూపొందించాలన్నారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి,రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ, బిజె ఎల్‌ పి నాయకుడు ఇంద్రాసేనారెడ్డి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇటీవల హిందూపూర్‌ లో బిజెపి నాయకులపై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ జిల్లా ఎస్పీని సస్పెండ్‌ చేయాలనికోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X