వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన సిబిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ కేసులో నిందితుడైన ఇటలీ వ్యాపారవేత్తక్వత్రోచిని పట్టుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. క్వత్రోచి ఆచూకీ తెలియకపోవడంతో సిబిఐ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది.

భారత్‌కు తనను అప్పగించాలనే కేసు నుంచి కోర్టు ద్వారా బయటపడిన క్వత్రోచి పక్షం రోజుల క్రితం కౌలాలంపూర్‌ నుంచి వెళ్లిపోయారు. తాము మలేషియా అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నప్పటికీ క్వత్రోచీ ఆచూకీ తమకు తెలియడం లేదని సిబిఐ డైరెక్టర్‌ పి.సి. శర్మ అన్నారు. ఆయన ఇటలీలో ఉన్నట్లు వచ్చిన వార్తలను విలేకరులు ప్రస్తావించగా ఇటలీలోని రోమ్‌లో తమ అధికారులు తగిన ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. మలేషియాకు తన ప్లాన్‌ ప్రకారం తిరిగి వస్తానని క్వత్రోచీ చెప్పారు కదా అని అంటే దురదృష్టవశాత్తు భారత్‌ నుంచి వెళ్లిపోయే సమయంలో కూడా అదే మాట చెప్పారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X