వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్‌ఎస్‌ బంద్‌- బస్సు దగ్ధం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) శుక్రవారం తలపెట్టిన బంద్‌ చెదురు మొదురు సంఘటనలుమినహా ప్రశాంతంగా జరిగింది. తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో బంద్‌ ప్రభావంపెద్దగా కనిపించలేదు. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటాను డిమాండ్‌ చేస్తూ టిఆర్‌ఎస్‌ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.

హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఒక బస్సును దగ్ధం చేశారు. హయత్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ఆర్టీసి బస్సును చిలకలగుడా వద్ద ఆపేసి ప్రయాణికులను దింపి బస్సును దహనం చేశారు. కొన్ని బస్సుల టైర్లలో గాలి తీసేశారు. దీంతో జంటనగరాల్లో బందోబస్తును పెంచారు.

కరీంనగర్‌లో టిఆర్‌ఎస్‌ బంద్‌తో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామికంగా ఉద్యమిస్తున్న తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాజేశ్వరరావు విమర్శించారు. బంద్‌ను విఫలం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన అన్నారు. వరంగల్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. రెండు బస్సుల టైర్లలో ఆందోళనకారులు గాలి తీసేశారు. దాదాపు 50 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసి బస్సులు నడవలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X