వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోమ్‌ పేజి

By Staff
|
Google Oneindia TeluguNews

కోచి: రాష్ట్రాలు కాలం చెల్లిన సిద్దాంతాలను పట్టుకు వేళ్ళాడకుండా, సంస్కరణ పథంలో ముందుకు సాగాలని ప్రధాని వాజ్‌ పేయి పిలుపునిచ్చారు. ఆర్థిక పురోగతికి మరింత ఊతమివ్వాలి. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మనం ముందడుగు వేయగలమని ప్రధాని అభిప్రాయపడ్డారు.

అన్ని రాష్ట్రాలు ఇదే వైఖరిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. శనివారం కేరళలోని కోచి నగరంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కార్మికుల హక్కులను కాపాడాలి. అందులో సందేహం లేదు. కానీ కార్మికుల హక్కులంటే సమ్మెలు, బంద్‌ లు కాదని ఆయన కేరళలోని కమ్యూనిస్ట్‌ కార్మికనేతలకు చురక అంటించారు. దేశంలోని ఏ రాష్ట్రప్రభుత్వాలైనా, ఏ పార్టీ ప్రభుత్వాలైనా - పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పన, సమానత్వం అంశాలు లక్ష్యాలుగా పనిచేయాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X