హోమ్ పేజి
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడివంటగ్యాస్ ధర పెంచకుండా చూస్తానని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ఆయన శనివారం జన్మభూమికార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పేదలకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకోవాలనికేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయనచెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారులఅనుసరిస్తున్న తీరు పట్ల ఆయన ఆగ్రహంవ్యక్తం చేశారు. కొందరు అధికారులపై విశాఖపట్నంలోఆయన చర్యలు తీసుకున్నారు. బడిపిల్లల కోసంఅమలు చేస్తున్న మధ్యాహ్నభోజనపథకం నిర్వహణను స్వయం సహాయకగ్రూప్లకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. వంట, వడ్డన పిల్లలతలిదండ్రులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.
విశాఖపట్నానికి వచ్చే ఏడాది లోగామంచినీరు అందిస్తామని, గోదావరి జలాలను ఏలూరు కాలువలోకివదిలి విశాఖపట్నానికి మంచినీరు అందిస్తామని,మొదటి దశ ప్రాజెక్టుకు 310 కోట్ల రూపాయలుఖర్చవుతాయని ఆయన చెప్పారు.