వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డోపింగ్ నుంచి సునితారాణికి విముక్తి
న్యూఢిల్లీ: డోపింగ్ ఆరోపణల నుంచి భారత మహిళా అథ్లెట్ సునితారాణికి విముక్తి లభించింది. సునితారాణిని డోపింగ్ ఆరోణల నుంచి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఎఎఎఫ్) విముక్తి ప్రసాదించింది.
సియోల్ లాబొరేటరీ నిర్వహించని డోపింగ్ టెస్టులో గల లోపాల వల్ల సునీతారాణిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఐఎఎఎఫ్ స్పష్టం చేసింది. డోప్ కంట్రోల్ సెంటర్ ఇచ్చిన నివేదికను తాము అంగీకరించలేదని తెలియజేసింది. ఈ నెలాఖరులో బూసాన్లో ఆసియా క్రీడల్లో సునీతారాణి గెల్చుకున్న పతకాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఆమెకు తిరిగి ఇస్తుందని భావిస్తున్నారు. సునీతారాణి కేసును ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెడికల్ కమిషన్ సమీక్షించింది.
Comments
Story first published: Friday, January 3, 2003, 23:53 [IST]