ఘోరరైలు ప్రమాదం- 19 మంది మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్- మన్మాడ్ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 19 మంది మరణించారు.59 మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో జరిగిన రెండోపెద్ద రైలు ప్రమాదం ఇది.
మన్మాడ్కు చెందిన ఎక్స్ప్రెస్రైలు శక్రవారంనాడు స్టేషనరీ గూడ్స్ రైలుఢీకొంది. మానవ వైఫల్యం వల్లనే ఈప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో బీడ్ జిల్లాఘాట్నందూర్ స్టేషన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటన్నరకు ఈప్రమాదం జరిగింది. అదే ట్రాక్పై వస్తున్న గూడ్స్రైలును చూసి సికింద్రాబాద్- మన్మాడ్ ఎక్స్ప్రెస్డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్లు వేసినట్లు, దీంతో మూడు కోచ్లు పట్టాలు తప్పినట్లుప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మానవ వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందనిరైల్వే మంత్రి నితీష్ కుమార్ అంగీకరించారు.బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామనిఆయన హెచ్చరించారు. ప్రమాదం అనంతరంఅసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, పాయింట్మన్ ఆచూకీలేదని ఆయన చెప్పారు.