వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్పై సిబిఐ దర్యాప్తు: రబ్రీ
పాట్నా: బూటకపు పోలీసు ఎన్కౌంటర్లోముగ్గురు విద్యార్థులు మరణించినసంఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)చేత దర్యాప్తు చేయించడానికి బీహార్ రబ్రీ దేవి ప్రభుత్వంఅంగీకరించింది. భారీ హింస అనంతరం ప్రతిపక్షాలడిమాండ్కు రబ్రీ ప్రభుత్వం తలవంచి సిబిఐదర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది.
బెగుసరాయ్ జిల్లాలోని మజ్హాల్లోఇద్దరు వ్యక్తులను పోలీసులు కాల్చి చంపినసంఘటనపై కూడా సిబిఐ దర్యాప్తు జరుపుతుందనిరబ్రీదేవి చెప్పారు. ముగ్గురు విద్యార్థులను పోలీసులు కాల్చిచంపడంపైపాట్నాలో పెద్ద యెత్తున ఆందోళనజరుగుతోంది. ఈ ఆందోళనలో హింస కూడా చోటుచేసుకుంది. ఈ ఆందోళనను మరింత ఉధృతంచేయడానికి ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్న తరుణంలో ప్రభుత్వం సిబిఐదర్యాప్తుకు అంగీకరించింది.
Story first published: Saturday, January 4, 2003, 23:53 [IST]