వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం ఉగ్రవాదంపై పోరు: విహెచ్‌పి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: దేశాన్ని అస్థిరం పాలు చేసేందుకు మదర్సాలలో వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) ఆరోపించింది. ముస్లిం మతతత్వవాదులు హిందూ సెంటిమెంట్లను దెబ్బ తీస్తుంటే మిన్నకుండడం సాధ్యం కాదని విహెచ్‌పి ఉపాధ్యక్షుడు సదానంద కకాడే అన్నారు.

హిందూ సమాజం ఐక్యతను, ప్రపంచంలోని ఇతరుల మేలును కోరుతుందని, అందువల్ల అది మతతత్వవాదం, సంకుచితం కాదని ఆయన శనివారం విలేకరులతో అన్నారు. ఈ మతతత్తవాదులను ఎదుర్కోవడానికి హిందువులందరూ ఏకం కావాలని, లేనిపక్షంలో గుజరాత్‌లోని గోద్రా సంఘటన ఎక్కడైనా పునరావృతం కావచ్చునని ఆయన అన్నారు.

భారతదేశంలో ఇస్లామిక్‌ మతతత్వవాదుల కార్యకలాపాల గురించి పత్రికలు రాయడం లేదని, బలవంతపు మత మార్పిడుల వల్ల ముస్లింల జనాభా పెరుగుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X