వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భాగస్వామ్య సదస్సుకు అద్వానీశ్రీకారం
హైదరాబాద్:
భారత
పారిశ్రామిక
సమాఖ్య(సిఐఐ),
రాష్ట్ర
ప్రభుత్వం
సంయుక్తంగా
ఏర్పాటు
చేసిన
భాగస్వామ్య
సదస్సును
ఉప
ప్రధాని
ఎల్.కె.
అద్వానీ
ప్రారంభించారు.
ఆయన
ఆదివారం
హైదరాబాద్లోని
శిల్పకళా
వేదికలో
ఈ
సదస్సును
ప్రారంభించారు.
విదేశీపెట్టుబడులను రాబట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సదస్సు అభిప్రాయపడింది. ఇదే సమయంలో దేశీయ పరిశ్రమలవిస్తరణపై దృష్టి పెట్టాలని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో వివిధ దేశంలోని, విదేశాలలోని 800 ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టనుపెంచగలదని భావిస్తున్నారు.
ఈ సదస్సును ప్రారంభించడానికి వచ్చిన అద్వానీకి అంతకు ముందు బేగంపేటవిమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయస్వాగతం పలికారు.
Comments
Story first published: Sunday, January 5, 2003, 23:53 [IST]