వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని చేసే చోట ఉండకుంటే చర్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: పని చేసే చోట నివాసం ఉండని ప్రభుత్వోద్యోగులను చూస్తూ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని పలు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పని చేసే చోట వుండడం లేదని ఆరోపణలు రావడంతో కరీంనగర్‌ జిల్లాలోని ఇద్దరు ఉద్యోగులపై ఆయన చర్యలు తీసుకున్నారు. ఒక ఉద్యోగికి రెండు ఇంక్రిమెంట్లలో కోత విధిస్తున్నట్లు, మరో ఉద్యోగిని బదిలీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అధికారులు చెప్పినవివరాలను తన ల్యాప్‌టాప్‌లో పరిశీలిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాగునీటి కల్పనకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని ఆయన చెప్పారు. 20 కోట్ల రూపాయలతో మంచినీరందించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. బడి పిల్లల కోసంపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదరించాలని ఆయన ప్రజలనుకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X