ఆందోళనలు, ధర్నాలతో జన్మభూమి
హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా
ప్రభుత్వం
చేపట్టిన
18వ
విడత
జన్మభూమి
కార్యక్రమానికి
పలు
చోట్ల
ఆదివారం
అవరోధాలు,
అడ్డంకులు
ఎదురయ్యాయి.
గత
జన్మభూమి
కార్యక్రమాల్లో
ఇచ్చిన
హామీలే
నెరవేర్చనప్పుడు
కొత్త
జన్మభూమి
ఎందుకంటూ
ప్రజలు,
ప్రతిపక్షాల
కార్యకర్తలు
నిలదీశారు.
కార్యక్రమాలు
రసాభాసగా
ముగిశాయి.
పలు చోట్ల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నోడల్ అధికారులనుఘెరావ్ చేశారు; వారిని నిలదీశారు. ప్రకాశం జిల్లా వెంకటాయపాలెంలోపీపుల్స్వార్ నక్సలైట్లు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. జన్మభూమి గ్రామసభలో పాల్గొనడాకి వచ్చిన అధికారులను జీపు నుంచి దింపేసి ఆ జీపును దగ్ధం చేశారు.విజయవాడ సమీపంలోని పాయకరావు పేటలో జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కార్యకర్తలు ప్రయత్నించారు. గ్రామసభలో నినాదాలతో గందరగోళం సృష్టించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు బయటకు నెట్టేశారు. అనంతరం వామపక్షాలువిజయవాడలో రాస్తారోకో నిర్వహించాయి.
తిరుపతిలో నోడల్ అధికారులను ప్రజలు నిలదీశారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనప్పుడు కొత్త ఆర్జీలు ఎందుకని ప్రశ్నిస్తూ వాటిని చింపేశారు. వరంగల్ జిల్లా ఎనుమోలు గ్రామంలో అధికారులను గంట పాటుఘెరావ్ చేశారు. ఖాళీ బిందెలతో, కుండలతో ప్రదర్శన చేశారు. కలెక్టర్ను చుట్టుముట్ఆరు.విశాఖపట్నం జిల్లా సావర పల్లెలో కూడా జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకున్నారు.