మందుపాతరకు ముగ్గురు జవాన్ల బలి
హైదరాబాద్:
గుంటూరు
జిల్లాలో
ముగ్గురు
పోలీసులు
నక్సలైట్లు
పేల్చిన
మందుపాతరకు
బలయ్యారు.
గుంటూరు
జిల్లా
దాచేపల్లి
వద్ద
ఆదివారం
ఉదయం
ఈ
దారుణ
సంఘటన
జరిగింది.
ప్రభుత్వ జన్మభూమి కార్యక్రమానికి వెళ్తున్న నోడల్ అధికారులకు ఎస్కార్ట్గా ఈ పోలీసులు వారి వెంట ఉన్నారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. జన్మభూమి కార్యక్రమాన్ని లక్ష్యంగాపెట్టుకుని సారంగపల్లి ఆగ్రహారం, కొత్తూరు గ్రామాల మధ్య నక్సలైట్లు మాటువేశారు. జన్మభూమి వాహనాలు సమీపించగానే నక్సలైట్లు మందుపాతరపేల్చారు. అది పేలే లోగా నోడల్ అధికారుల వాహనం దాటిపోయింది. ఆ తర్వాత మోటార్సైకిళ్లపై వెళ్తున్న పోలీసులు మందుపాతరకు బలయ్యారు. ఈ సంఘటనలో ఆంధ్రప్రదేశ్స్పెషల్ పోలీఉ దళానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మరణించారు. దాచేపల్లి పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ పొదిలి శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
ఈ సంఘటన జరిగిన అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మందుపాతర పేలుడులో మరణించిన పోలీసులు కుటుంబాలను పరామర్శించేందుకు హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్, పోలీసు డైరెక్టర్ జనరల్పేర్వారం రాములు అక్కడికి బయలుదేరి వెళ్లారు.