పోలియో వ్యాధిని నివారిస్తాం: బాబు
హైదరాబాద్:
రాష్ట్రంలో
పోలియో
వ్యాధిని
పూర్తిగా
నివారించడానికి
చర్యలు
తీసుకుంటామని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చెప్పారు.
పల్స్పోలియో
కార్యక్రమాన్ని
ఆయన
ఆదివారం
హైదరాబాద్
జూబిలీహిల్స్లోని
ఒక
పాఠశాలలో
లాంఛనంగా
ప్రారంభించారు.
పోలియో వ్యాధితో పాటు వివిధ రకాల వ్యాధులను నివారించడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. పిల్లలకు కొందరికి ముఖ్యమంత్రి పల్స్ పోలియో చుక్కల మందు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో,రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కుల వేశారు.
రాష్ట్రంలోని 63 వేలకేంద్రాలలో ఈ కార్యక్రమం నడించింది. వరంగల్ జిల్లాలో నాలుగు లక్షల మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందు ఇచ్చారు. నిజామాబాద్లో మంత్రి నేరేళ్ల ఆంజనేయులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.