వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ముగ్గురు నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో పోలీసులుమరో ముగ్గురు నక్సలైట్లను కాల్చి చంపారు.ఆదివారం నక్సలైట్లు మందుపాతర పేల్చి ముగ్గురు పోలీసులను బలి తీసుకున్న అనంతరం కొత్తూరు గ్రామంవద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురునక్సలైట్లు హతమయ్యారు. ఈ సంఘటన అనంతరం పోలీసులుపెద్ద యెత్తున గాలింపు చర్యలుచేపట్టారు.

పోలీసుల గాలింపు సందర్భంగా సోమవారం తెల్లవారుజామున బండ్లమొత్తు గ్రామంవద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు హతమయ్యారు. మరణించిన నక్సలైట్లు గుర్తించాల్సి వున్నది. ఆదివారంనాడు హైదరాబాద్‌ నుంచి గుంటూరు వచ్చిన పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) పేర్వారం రాములు గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మందుపాతర పేలిన సంఘటన అనంతరం పొరుగు జిల్లాల నుంచి సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినవారిలో ఒక మహిళా నక్సలైట్‌ కూడా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X