మరో ముగ్గురు నక్సల్స్ హతం
గుంటూరు: గుంటూరు జిల్లాలో పోలీసులుమరో ముగ్గురు నక్సలైట్లను కాల్చి చంపారు.ఆదివారం నక్సలైట్లు మందుపాతర పేల్చి ముగ్గురు పోలీసులను బలి తీసుకున్న అనంతరం కొత్తూరు గ్రామంవద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురునక్సలైట్లు హతమయ్యారు. ఈ సంఘటన అనంతరం పోలీసులుపెద్ద యెత్తున గాలింపు చర్యలుచేపట్టారు.
పోలీసుల గాలింపు సందర్భంగా సోమవారం తెల్లవారుజామున బండ్లమొత్తు గ్రామంవద్ద జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పీపుల్స్వార్ నక్సలైట్లు హతమయ్యారు. మరణించిన నక్సలైట్లు గుర్తించాల్సి వున్నది. ఆదివారంనాడు హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చిన పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) పేర్వారం రాములు గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మందుపాతర పేలిన సంఘటన అనంతరం పొరుగు జిల్లాల నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించినవారిలో ఒక మహిళా నక్సలైట్ కూడా ఉంది.