వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడుకుతున్నపల్నాడు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు/హైదరాబాద్‌: గుంటూరు జిల్లా పల్నాడు అట్టుడుకుతోంది. గత కొంతకాలంగా పల్నాడుపీపుల్స్‌వార్‌ కార్యకలాపాలకు ప్రధాన ప్రాంతంగా మారింది. దీంతో విధ్వంసాలు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా ఆదివారం సంఘటనఅగ్నికి ఆజ్యం పోసినట్లయింది. నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్ల కోసం పోలీసులు గ్రామాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. నక్సలైట్లు ఆదివారంనాడు మందుపాతరపేల్చి ముగ్గురు పోలీసు కానిస్టేబుల్స్‌ను బలి తీసుకున్న వెంటనే పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గాలింపు చర్యలను డిజిపిపేర్వారం రాములు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం ఉదయం ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. నక్సలైట్లు కూడా రాష్ట్రంలోని వివిధ చోట్ల విధ్వంసకరమైన చర్యలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఒక మాజీ శాసనసభ్యుడి ఇంటినిపేల్చేశారు. గుంటూరు జిల్లాలో ఒక కల్వర్ట్‌ను పేల్చేశారు. వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌లో ఒక ప్రైవేట్‌ క్యాంటిన్‌ను నక్సల్స్‌పేల్చేశారు. గుంటూరు జిల్లా పల్నాడులో అధికారులు జన్మభూమి కార్యక్రమాలను నిలిపేశారు.

నక్సలైట్లు మందుపాతరలు పేల్చి తమ వారిని చంపుతుంటే చూస్తూ ఊర్కోమని డిజిపి రాములు అన్నారు. పోలీసులు సహనం కోల్పోయారని, ప్రతీకార దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. మందుపాతరలుపెట్టి, బాంబులు పెట్టి తమ వారిని నక్సలైట్లు చంపుతుంటే తాము చూస్తూ కూర్చోమని, తిరిగి కాలుస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X