జాతీయ, లౌకికవాదాలపై చర్చ: వెంకయ్య
హైదరాబాద్: జాతీయ, లౌకికవాదాలనుపునర్నిర్వచించాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నందునవీటిపై చర్చ జరపాలని భారతీయ జనతా పార్టీ(బిజెపి) జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుఅన్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలను ప్రతిపక్షాలు తక్కువ చేసి చూడడాన్నిఆయన తీవ్రంగా విమర్శించారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టంగాఉన్నాయని, కానీ ఆ ఫలితాలను కాంగ్రెస్ తక్కువ చేసిచూపే ప్రయత్నం చేస్తోందని, మరికొందరు జాతీయ, లౌకికవాదాలనుపునర్నిర్వచించే పనిలో పడ్డారని, అందువల్ల ఈ రెండువాదాలపై జాతీయ చర్చ జరగాలని ఆయన అన్నారు. పార్టీ కొత్త భవనానికి సోమవారం భూమి పూజ చేసిన అనంతరంఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించిప్రసగించారు. సాంస్కృతిక పునరుద్ధరణే గుజరాత్లో బిజెపివిజయానికి కారణమని, తమ సాంస్కృతికజాతీయవాదం నినాదానికి తిరుగులేని ప్రతిస్పందన లభించిందనిఆయన అన్నారు.
విషయాలను కమ్యూనిస్టులుచాలా ఆలస్యంగా గుర్తిస్తారని, తాము తప్పుచేశామని, ఒప్పుకుంటారని, రాజకీయాల్లో వారిరిలవెన్సు తగ్గుతున్నప్పటికీ వారి విషప్రచారాన్ని తిప్పికొట్టాల్సినఅవసరం ఉన్నదని ఆయన అన్నారు. బిజెపి ఎజెండాహిందుత్వ అని, అయితే దానికి ప్రతిపక్షాలుపెడర్థాలు తీస్తున్నాయని వెంకయ్యనాయుడుఅన్నారు.