వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థానీయులను పంపేయండి: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అక్రమంగా దేశంలో తిష్టవేసిన విదేశీయులను గుర్తించి వారిని వెంటనే పంపించివేయాలని కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ రాష్ట్రాలకు సూచించారు. ఇందుకు రాష్ట్రాలు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆయన చెప్పారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల, పోలీసు డైరెక్టర్స్‌ జనరల్‌ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు.

భారతదేశంలో 11,500 మంది పాకిస్థానీయులు, 15 లక్షల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా వుంటున్నారని అద్వానీ చెప్పారు. పాకిస్థానీయులు తగిన పత్రాలు, పాస్‌పోర్టులతో మన దేశానికి వచ్చారని, అయితే నిర్దిష్ట కాలపరిమిత ముగిసిన తర్వాత కూడా ఇక్కడే వుండిపోయారని,వీరి పట్ల రాష్ట్రాలు ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నాయోఅర్థం కావడం లేదని ఆయన అన్నారు. వారిని గుర్తించి పంపించి వేయడానికి కేంద్ర రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చిందని ఆయన చెప్పారు.

భారత పౌరుల జాతీయ నమోదు కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టనుందని, ఇందులో భాగంగా భారత పౌరులకు మల్టీ పర్పస్‌ జాతీయ గుర్తింపు కార్డులు ఇస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X