వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడులకు భారీ రాయితీలు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి భారీ రాయితీలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులో ఆయన మంగళవారం దేశ, విదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

వనరులు, సహజవాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలనుకోరారు. డ్వాక్రా గ్రూప్‌ల ఉత్పత్తులను మార్కెట్‌ చేయాలని ఆయన బహుళ జాతి సంస్థలకువిజ్ఞప్తి చేశారు. పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను, వనరులను పెంచడంతో పాటు పాలనాపరమైన వెసులబాటు కల్పిస్తామని కూడా ఆయన చెప్పారు. ఇందుకు గాను జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

వివిధ రంగాల్లో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలతో విడివిడిగా కూడా సమావేశమయ్యారు.

ఇదిలా వుండగా, భాగస్వామ్య సదస్సు జరుగుతున్న తాజ్‌ రెసిడెన్సీ వద్ద గ్లోబలైజేషన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించిన 400 మంది అఖిల భారతవిద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరు నినాదాలు చేస్తూ సదస్సు జరుగుతున్న వేదిక వద్దకు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X