వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ నామరూపాలుండవు: ఫెర్నాండెజ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారత్‌పై అణ్వాయుధ దాడికి పూనుకుంటే పాకిస్థాన్‌ అనేది వుండదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ హెచ్చరించారు. ఆయన మంగళవారం ఇక్కడ జరిగిన భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు.

పాక్‌ అణ్వాయుధ దాడికి పాల్పడితే మనం కొద్దిగానే నష్టపోతామని, భారత్‌ ఎదురుదాడికి పూనుకుంటే పాకిస్థాన్‌ అనేది నామరూపాలు లేకుండా పోతుందని ఆయన అన్నారు. అణ్వాయుధ దాడుల గురించి మాట్లాడవద్దని ఆయన పాకిస్థాన్‌ నాయకత్వానికి హితవు చెప్పారు. తమ దేశం అణ్వాయుధ దాడికి పూనుకుంటుందని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ చేసిన ప్రకటన బాధ్యతారహితమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధమైన మాటలు తమ దేశానికి గానీ, ప్రపంచానికి గానీ ఏ మాత్రం పనికి రావని పాకిస్థాన్‌ గుర్తించాలనిఆయన అన్నారు.

భారత్‌ తనంతతాను అణ్వాయుధాలను ప్రయోగించిందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కునే సత్తా మన దేశ సాయుధ బలగాలకు ఉన్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X