రుణభారంపై బాబుకు కెఆర్ హెచ్చరిక
హైదరాబాద్:
భారతదేశంలో
అమలవుతున్న
ఆర్థిక
సంస్కరణల
రూపం
ప్రజావ్యతిరేకమైనదని
మాజీ
రాష్ట్రపతికె.ఆర్.
నారాయణన్
విమర్శించారు.
ఆరు
రోజుల
ఆసియా
సామాజిక
వేదిక
ముగింపు
సమావేశంలో
ఆయన
మంగళవారం
ప్రసంగించారు.
రాష్ట్రాన్ని, తనను హద్దులు లేని రుణభారంలో ముంచెత్తుకోవడంపై ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సంస్కరణలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, మానవ హక్కులకు భంగం కలుగకుండా వాటిని అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలవుతున్న సంస్కరణల వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని ఆయన అన్నారు.
దేశంలోని
ప్రభుత్వ
రంగ
సంస్థల
ప్రైవేటీకరణ
తీరను
ఆయన
వ్యతిరేకించారు.
ప్రపంచం
ఇప్పటికీ
సంక్షేమ
రంగానికి
సహకరిస్తుండగా
భారతదేశం
మాత్రం
విచిత్రంగా
ప్రభుత్వ
రంగ
సంస్థల
నుంచి
తప్పుకుంటోందని
ఆయన
అన్నారు.
ప్రైవేటీకరణ
చాలా
మంది
పాలిట
మృత్యుపాశంగా
మారిందని,
ప్రజల
జీవన
ప్రమాణాలుపెరిగేందుకు
ఉపయోగపడలేదని
ఆయన
అన్నారు.
సంస్కరణలు,
గ్లోబలైజేషన్
అధికారం
కొన్ని
అగ్రశక్తుల
గుప్పిట్లో
కేంద్రీకృతం
కావడానికే
ఉపయోగపడుతున్నాయని
ఆయన
అభిప్రాయపడ్డారు.
అగ్ర
రాజ్యం
ప్రయోజనాలకు
బలి
కావడానికి
బదులు
మనం
ఇప్పుడు
అలీన
ఉద్యమానికి
మరింతగా
కట్టుబడి
వుండాలని
ఆయన
అన్నారు.
ఆర్థిక విధానాలను రాజకీయాంశాల నుంచి విడదీయలేమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీతఅంగ్ స్యూ కుయి అన్నారు. గ్లోబలైజేషన్ లక్షలాది మంది ప్రజల మానవ హక్కులను కాలరాస్తోందని ఆమె అన్నారు.