వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లల భోజనంలో కులం పడగ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బడి పిల్లల మధ్యాహ్నం భోజనం పథకం అమలులో కులం పడగ విప్పుతోంది. అంటరానితనం తిరిగి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. దళితులు వంటలు చేసే చోట ఇది భూతమై పడుతోంది.

దళితులు వంటలు చేస్తే తమ పిల్లలు తినబోరని ఇతర అగ్ర కులాల వారు మొండికేస్తున్నారు. డ్రాక్వా గ్రూపుల మధ్య తగాదాలు కూడా ఈ కార్యక్రమం అమలులో ఆటంకాలు కల్పిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌, రామగుండం, కోరుట్ల తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో తమ పిల్లలు భోజనం చేయబోరని అగ్రకులాలవారు తెగేసి చెప్పారు. రామగుండం మండలంలోని ఒక గ్రామంలో వంట చేసినవిద్యా కమిటీ చైర్‌పర్సన్‌ అయిన దళిత మహిళను కొందరు దుర్భాషలాడారు. అమెపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దళితుల చేత వంటలు చేయిస్తే తమ పిల్లలను బళ్లకు పంపడం మానేస్తామని చెబుతున్నారు.

రాజమండ్రి సమీపంలోని ఐ పోలవరం గ్రామంలో దళితుల పిల్లలు మాత్రమే మధ్యాహ్నం భోజనం ఆరగించారు.శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని ఒక గ్రామంలో రెండు డ్వాక్రా గ్రూప్‌ల మధ్య ఉన్నవివాదం కుల వివాదంగా ముందుకు వచ్చింది. దళిత కులానికిచెందిన డ్వాక్రా గ్రూప్‌ వారు వంటలు చేయడమేమిటని మరో గ్రూప్‌వివాదానికి దిగింది. పిల్లల తల్లిదండ్రులను నయానా భయానా ఒప్పించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X