భారత్ను గెలిపించిన జహీర్
వెల్లింగ్టన్:
ఎట్టకేలకు
న్యూజిలాండ్పై
భారత్విజయం
సాధించింది.
వరుస
అపజయాలతో
కృంగిపోయిన
భారత్కు
ఈవిజయం
ఆత్మస్థయిర్యాన్ని
ఇస్తుందనడంలో
సందేహం
లేదు.
ఏడు
మ్యాచ్ల
వన్డే
క్రికెట్
సిరీస్లో
భాగంగా
ఇక్కడ
జరిగిన
ఐదో
వన్డేలో
భారత్
రెండువికెట్ల
తేడాతో
న్యూజిలాండ్పై
విజయం
సాధించింది.
జహీర్ఖాన్
భారత్కు
ఈవిజయాన్ని
అందించాడు.
జహీర్
మ్యాన్
ఆఫ్
ది
మ్యాచ్గా
ఎంపికయ్యాడు.
భారత్ రెండు టెస్టు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఏడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఇప్పటికేకోల్పోయింది. దీంతో భారత్ పూర్తిగా ఢీలాపడిపోయింది. ఆటగాళ్లు ఆత్మస్థయిరాన్ని కోల్పోయారు. ఈ స్థితిలో ఐదో వన్డేవిజయం భారత ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నింపుతుందనడంలో అతిశయోక్తి లేదు.
జహీర్ఖాన్ మూడు న్యూజిలాండ్ వికెట్లను తీసుకోవడమే కాకుండా భారత్ను గెలిపించే బ్యాటింగ్ చేశాడు. జహీర్ 34 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. యువరాజ్ సింగ్విజయానికి బాటలు వేసి విట్టోరి బౌలింగ్లో హర్రీస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అప్పటికి భారత్కు రెండు వికెట్లు మాత్రమేమిగిలి ఉన్నాయి. యువరాజ్ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన శ్రీనాథ్ జహీర్కు మంచి తోడ్పాటునందించాడు.సెహవాగ్ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. గంగూలీ మొదటి బంతికేపెవిలియన్ దారి పట్టగా సచిన్ టెండూల్కర్ కూడా డకవుట్ అయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 168 పరుగులు చేసింది. 42.4 ఓవర్లు మాత్రమే న్యూజిలాండ్ ఆడగలిగింది. జహీర్ఖాన్ 8 ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి మూడువికెట్లు తీసుకున్నాడు. శ్రీనాథ్ రెండు వికెట్లు, ఆశిష్ నెహ్రా రెండువికెట్లు, గంగూలీ ఒక వికెట్, కుంబ్లే రెండు వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లో బ్రెండోన్, ఆండ్రీ ఆడమ్స్ 35 పరుగులేసి చూశారు.