వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధ్యాహ్న భోజనానికి తరుణ్ సాయం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న మధ్యాహ్న భోజన పథకానికి యువ హీరో తరుణ్ లక్ష రూపాయలనుఅందచేశారు. బుధవారం తరుణ్ పుట్టిన రోజు. ఈసందర్భాన్ని పురష్కరించుకొని ఆయన బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలసి లక్షరూపాయల చెక్ నుఅందచేశారు.
పాఠశాల విద్యార్థులకు కల్పిస్తున్న ఈ పథకానికి తన వంతు సాయంగా ఈ మొత్తాన్నిఅందచేసినట్లు తరుణ్ విలేకరులకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాదిలో నీ మనసు నాకు తెలుసు తొలుత విడుదల అవుతుందని తెలిపారు. అనంతరం దుర్గా ఆర్ట్స్ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.
Story first published: Wednesday, January 8, 2003, 23:53 [IST]