యుపిలో చలికి 40 మంది మృతి
లక్నో:
గత
24
గంటల్లో
చలిగాలులకు
ఉత్తర
ప్రదేశ్లో
40
మందికిపైగా
మరణించారు.
దీంతో
బుధవారం
ఉదయానికి
తీవ్ర
చలిగాలులకు
ఉత్తరప్రదేశ్లో
మరణించినవారి
సంఖ్య
136కుపెరిగింది.
అత్యధిక మరణాలు బలరామ్పూర్లో సంభవించాయి. ఈ జిల్లాలో ఆరుగురు మరణించారు. వారణాసి జిల్లాలో ఐదుగురు, లక్నో, కాన్పూర్, బహ్రయిచ్, హమీర్పూర్, ఝాన్సీలలో ముగ్గురేసి, బల్లియా, మహొబా,మీర్జాపూర్, బరేలీ, జౌన్పూర్, బందా జిల్లాల్లో ఇద్దరేసి, బదోహి, మధుర, సంత్ కబీర్నగర్, బుదౌన్లలో ఒక్కరేసి మరణించారు. లక్నోలో ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రత 3.4 డిగ్రీలసెల్సియస్ నమోదయింది. కాన్పూర్లో 3.2 డిగ్రీలసెల్సియస్ నమోదయింది.
దట్టమైన పొగమంచు అలుముకోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. పలువిమానాలను రద్దు చేశారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పాఠశాలలన్నింటినీ మూసివేశారు. పాఠశాలలను ఈ నెల 11వ తేదీకి బదులుగా 13వ తేదీన తిరిగి తెరవాలని ఆదేశించారు.