వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ, కాంగ్రెస్‌ నేతల బాహాబాహీ

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణాజిల్లాల్లో అనేక ప్రాంతాల్లో బుధవారం జన్మభూమి కార్యక్రమం రాజకీయ రణరంగంగా మారింది.విజయవాడలో టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు బహిరంగఘర్షణకు దిగారు. కార్యక్రమం మొదలైనప్పట్నుంచీ ఇరు పక్షాల మధ్య వైరం కొనసాగతున్నా, బుధవారం ఇది మరింత ముదరింది.విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగరంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఇరు పక్షాల నేతలుబాహాబాహీకి దిగారు.

నోడల్‌ అధికారి ముఖ్యమంత్రి సందేశాన్ని చదువుతుండగా కాంగ్రెస్‌ కు చెందిన స్థానిక కార్పోరేటర్‌ ఒకరు బయటికి వెళ్ళి వచ్చారు. అతన్ని దేశం నాయకుడు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు నిలదీశాడు. దీనికి అక్కడే ఉన్న డిప్యూటీ మేయర్‌ సత్యనారయణ అడ్డుతగిలారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ముదిరి ఒకరిమీదకు ఒకరు కుర్చీలు విసురుకునేంతవరకు వచ్చింది.విలేకరులు, అధికారుల అందరూ ముందు ఇరు పక్షాల నేతలు గొడవను ఉధృతం చేస్తుండగా పోలీసులు రంగంలోకి దిగి శాంతింప చేశారు. ఈ ఘర్షణలో కొందరుస్వల్పంగా గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X