వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో హైదరాబాదీ దుర్మరణం
షార్లోట్: బుధవార అమెరికాలోనినార్త్ కరోలినాలో జరిగిన విమాన ప్రమాదంలో 21మంది మరణించారు. మరణించినవారిలోఇద్దరు భారతీయలు కూడా ఉన్నారు. వీరు అక్కడిక్లెమ్సన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటోన్నహైదరాబాద్ కు చెందిన బాదం శ్రీనివాస్ రెడ్డి, అతని మిత్రుడుతమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ గా పోలీసులుగుర్తించారు. వీరిద్దరూ క్లెమన్స్ యూనివర్సిటీలోఎం.ఎస్ చేస్తున్నారు.
కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు.వీరు ప్రయాణిస్తోన్న అమెరికా యూఎస్ ఎయిర్వేస్ విమానం షార్లోట్ విమానాశ్రమం నుంచిటేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపంవల్ల వెనుదిరిగింది. విమానం పైలట్ అదుపుతప్పి ఎయిర్ పోర్ట్ లోని షెడ్ లనుఢీకొని పేలిపోయింది. ప్రమాద కారణాలు ఇంకాతెలియరాలేదు. మొత్తం 21 మంది మరణించినట్లుఅధికారులు తెలిపారు.
Story first published: Thursday, January 9, 2003, 23:53 [IST]