వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్వంద్వ పౌరసత్వం: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొన్ని దేశాల్లోని భారత సంతతికి చెందినవారికి ద్వంద్వ పౌరసత్వం ఇవ్వనున్నట్లు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రకటించారు. ఇందుకుగాను వచ్చే నెల జరిగే పార్లమెంటుబడ్జెట్‌ సమావేశాల్లో ఒక చట్టాన్ని తేనున్నట్లు ఆయన తెలిపారు.

ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి పాలనాపరమైన నియమనిబంధనలను రూపొందించే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు. ప్రథమ ప్రవాసి భారతీయ దివస్‌ ఉత్సవాలను ఆయన గురువారం ప్రారంభించారు. తాము వలసపోయిన దేశ పౌరసత్వానికి, తమ భారత గుర్తింపునకు మధ్య వైరుధ్యం తలెత్తకుండా జీవిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ స్థితిలో కొన్ని దేశాల్లోని భారత సంతతికి చెందినవారికి ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలనే ఎల్‌.ఎం.సంఘ్వీ నేతృత్వంలోని కమిటీ సూచనను ప్రభుత్వంఅంగీకరించిందని ఆయన చెప్పారు. నేటి నాన్‌- రెసిడెంట్‌ ఇండియన్లు రేపటి ప్రవాసీ భారతీయులని ఆయన అన్నారు. గల్ఫ్‌ ప్రాంతానికి వలస పోతున్న భారత కార్మికుల కోసం బీమా పథకాన్ని తప్పనిసరి చేయనున్నట్లు ఆయన చెప్పారు.

విదేశాల్లో పని చేసే భారత కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసే బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. గల్ఫ్‌లో పని చేస్తున్న కార్మికుల పిల్లల కోసంవిద్యా సంస్థల్లో కొన్ని సీట్లు కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X