వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలిక రేప్‌: వరంగల్‌ లో ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాశాయంపేట మండలం పెదకొడెపాక గ్రామానికిచెందిన ఓ బాలిక బుధవారం గ్యాంగ్‌ రేప్‌ కుగురై మృతి చెందింది. ఈ పాశవిక సంఘటన తీవ్రగ్రామంలో తీవ్ర సంచనం కలిగించింది. ఆగ్రహాంతో ఊగిపోయిన గ్రామ ప్రజలునిందితుల ఇంటిపై దాడి చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్థులనుఅడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆవేశపడ్డ గ్రామస్థులుపోలీసులపై దాడికి దిగారు. దీంతో ఘర్షణ మరింతముదిరి లాఠీఛార్జీ జరగడం, ఈ ఘటనలో ఒకవ్యక్తి మృతి చెందడంతో...వరంగల్‌ కాసేపు అక్కడ తీవ్రఉద్రిక్తత నెలకొంది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెదకొడెపాక గ్రామానికిచెందిన గుర్రం యాదగిరి పదిహేనేళ్ళ కూతురుశైలజను అదే గ్రామానికి చెందిన ఇద్దరుయువకులు అత్యాచారం చేసి హత్య చేశారు.బుధవారం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో తిరుపతి, పోతరాజులువచ్చి ఆమెను బెదిరించి ఇంటిపక్కన ఉన్నగడ్డివాములోకి తీసుకెళ్ళారు. ఆమెపై అత్యాచారంచేశారు. ప్రతిఘటించిన శైలజ తలపై తీవ్రంగాకొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రాత్రి ఇంటికి వచ్చిన ఆమెతల్లితండ్రులు కూతురు ఎంతకీ కనిపించకపోవడంతోచుట్టుపక్కల అంతా వెతికారు.

గడ్డివాము వద్ద కూతురుశవమై కన్పించింది. సమాచారం అందిన పోలీసులు తెల్లారివచ్చి శవాన్ని మార్చురీకి తరలించేందుకుప్రయత్నించారు. కానీ శవాన్ని మార్చురీకి తరలించకుండా ఆగ్రామమహిళలు అడ్డుకున్నారు. నిందితుల ఇంటికివెళ్ళి, వారి ఇంటిపై దాడి చేసి పాక్షికంగాకూల్చివేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకుప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతోఅదనపు పోలీసు బలగాలను రప్పించి లాఠీఛార్జీజరిపారు. ఈ లాఠీఛార్జీలో అనేకులు గాయపడ్డారు.ఇందులో తీవ్రంగా గాయపడ్డ ఓ గ్రామస్థుడు కాసేపటికి మరణించాడు. దీంతో పరిస్థితి మరింతిఉద్రిక్తంగా మారింది. పోలీసులు వల్లే అతను మరణించాడని గ్రామాస్థులుఆరోపిస్తుండగా, అతని మరణానికి తమకు సంబంధంలేదని పోలీసులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X