వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలింజన్‌, ఆటో ఢీ- 9 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో రైలింజన్‌ ఒక ఆటోను ఢీనకొనడంతో 9 మంది మరణించారు. కాపలా లేని లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు వద్ద లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీకొట్టింది. దీంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ఈ ఘటన జరిగింది. డోకూరు నుంచి వెళుతోన్న ఒక ఆటో రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఇదే సమయంలో కర్నూలు వైపు వెళుతోన్న రైలింజన్‌ ఢీకొంది.

ఘటనపై భిన్నాభిప్రాయాలు
కాపలా లేని ఈ క్రాసింగ్‌ వద్ద రైలు రైకపోకల గురించి తెలియాలంటే రైలు హార్న్‌ మోగిస్తూ రావడం ఒక్కటే మార్గం. అయితే, ఈ రైలింజన్‌ ఎటువంటి హార్న్‌ మోగించలేదని గ్రామస్థులు అంటున్నారు. మరోవైపు, రైలు ఇంజన్‌ డ్రైవర్‌ పి.రాజయ్య మాత్రం తాను హార్న్‌ కొట్టానని, అయినా ఆటోను ముందుకు కదిలించలేదని తెలిపాడు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X