వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో రైతుల జలఘోష

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నానికి గోదావరి జలాల మల్లింపును తక్షణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రైతులు శుక్రవారం భారీ ర్యాలీని చేపట్టారు. విశాఖపట్నం రైల్వే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ నుంచి కలెక్టర్‌ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కాంగ్రెస్‌, వామపక్షాలు, బిజెపిలతో కూడిన గోదావరి జలసాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించగా ఇందులో కాంగ్రెస్‌ పాల్గొనలేదు.

జలఘోష పేరిట సాగిన ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. విశాఖకు గోదావరి నీరు తప్ప ప్రత్యామ్నయం లేదని సమితి పేర్కొంది. ప్రభుత్వం అలక్ష్యం చేయకుండా వెంటనే గోదావరి నీరును మల్లించాలని బిజెపి ఎమ్మెల్యే హరిబాబు డిమాండ్‌ చేశారు. మరోవైపు, విశాఖ మేయర్‌ రాజాన రమణి ప్రత్యేక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రభుత్వం తమకు అవకాశం ఇస్తే..నిధుల సేకరించి గోదావరి నీరును మల్లిస్తామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X