వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంగూలీలో సంతోషమూ, భయమూ!
ఆక్లాండ్: వరుస అపజయాలతో కుంగిపోయిన భారత్ రెండు మ్యాచ్ లు వరుసగా గెలవడంతో కెప్టెన్ గంగూలీలో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. శనివారం మ్యాచ్ కూడా గెలవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని గంగూలీ తెలిపాడు.
అయితే, భారత్ బ్యాట్స్ మెన్ ప్రతికూల ఒత్తిడిని తట్టుకోలేకపోవడం ఆందోళన కల్గిస్తోందని వివరించాడు. శనివారం మ్యాచ్ ఒక విధంగా సంతోషాన్ని ఇచ్చినా, ఆందోళన కూడా కలిగించింది. బౌలర్లు అద్భుతంగా రాణించడం, సెహ్వాగ్ ఫామ్ లోకి రావడం సంతోషకరమైన విషయాలు. అయితే, ఒకేసారి ఒత్తిడి పెరగగానే దానికి బ్యాట్స్ మెన్ లొంగిపోతున్నారు. ప్రతికూల పరిస్థితులలో నిలబడడం అలవర్చుకోకపోతే కష్టాలు తప్పవని గంగూలీ అభిప్రాయపడ్డాడు. చివరి వన్డే కూడా గెలిచి పరువు నిలబెట్టుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు.
Comments
Story first published: Saturday, January 11, 2003, 23:53 [IST]