వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కావాలంటే ప్రీతిజింటాకు భద్రత
ముంబై: భరత్ షా, మాఫియా లింక్ కేసులో సాక్ష్యం చెప్పిన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింటాకు ప్రత్యేక భద్రత కల్పించేందుకు ముంబై పోలీసులు సంసిద్దత వ్యక్తం చేశారు. ఆమె భద్రత కావాలని అడిగితే వెంటనే కల్పిస్తాం. కానీ ఆమె ఇంతవరకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయలేదని ముంబై పోలీస్ కు చెందిన ఉన్నతాధికారి తెలిపారు.
భరత్ షా కేసులో గురువారం ప్రీతి జింటా సాక్ష్యం చెప్పారు. బాలీవుడ్ కు, మాఫియాకు బలమైన బంధం ఉందని వాదిస్తోన్న ముంబై పోలీసులకు అనుకూలమైన సాక్షి ప్రీతి ఒక్కరే. ఈ కేసులో ఇంతముందుకు విచారణకు గురైన దర్శకుడు రాకేష్ రోషన్, హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ..అందరూ విచారణకు సరియైన రీతిలో సహకరించలేదు. మాఫియా లింక్స్ గురించి వారు ఏమీ చెప్పలేదు. ప్రీతి ఒక్కరే బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Story first published: Saturday, January 11, 2003, 23:53 [IST]