వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందూత్వపై చర్చ జరగాలి: మోడి
న్యూఢిల్లీ: హిందూత్వ అభివృద్ధికి ఆటంకం అని జరుగుతోన్న ప్రచారాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఖండించారు. హిందూత్వపై ఎటువంటి చర్చకైనా తాను సిద్దమని పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సత్కార సభలో ఆయన ప్రసింగించారు. కాలానికి ఎదురొడ్డి నిలిచినది ఒక్కే హిందూత్వేనని గుర్తు చేశారు.
హిందూత్వను వ్యతిరేకిస్తున్నవారికి సామాజిక అవగహన లేదని మోడి విమర్శించారు. హిందూత్వ ఒక తత్వం, జీవన విధానం. ఇది ఈ దేశ ప్రజల జీవితంలో భాగం. అందుకే భారతదేశం ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని అభివృద్ధి చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు.
హిందూత్వ అంశం వల్లే గుజరాత్ లో తాను గెలిచానన్న విశ్లేషణను ఆయన తిప్పికొట్టారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. కానీ హిందూత్వకు ఓటమి ఉంటుందా? అని ప్రశ్నించారు.
Comments
Story first published: Sunday, January 12, 2003, 23:53 [IST]