ఏ బౌలర్ కి భయపడను: సెహ్వాగ్
హామిల్టన్ : ప్రపంచంలో ఎంతటి బౌలర్ కు ఐనా భయపడనని స్ట్రోక్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కివీస్ వన్డే టూర్ లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన వీరెంద్ర సెహ్వాగ్ ఉత్సాహంగా ఉన్నాడు. పిటిఐ విలేకరితో ఆయన మాట్లాడుతూ..బౌలర్ గణాంకాలు, అతనికున్న పేరు నన్ను భయపెట్టవు. నిజానికి ఇప్పటివరకు ప్రపంచంలోని గొప్ప బౌలర్లను ఎదుర్కొనలేదు. ఐనప్పటికీ ఏ బౌలర్ ను చూసి నేను భయపడను. అని అన్నాడు.
ప్రస్తుత టూర్ లో బ్యాట్స్ మెన్ 30 పరుగులు సాధించడానికే ఇబ్బంది పడుతుంటే సెహ్వాగ్ సునాయసంగా రెండు సెంచరీలు సాధించాడు. ఆరు వన్డేలలో 49.17 సగటుతో 295 పరుగులు సాధించి ఈ సిరీస్ లో టాప్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు.
నాకు బౌలింగ్ చేసే బౌలర్ గురించి నేను పెద్దగా ఆలోచించను. బాల్ ను ఎలా కొట్టాలి. ఎలా పరుగులు రాబట్టాలనేదాని గురించే ఆలోచిస్తానని సెహ్వాగ్ తెలిపాడు. షేన్ బాండ్ ఐనా, గ్లెన్ మెక్ గ్రాత్ ఐనా, షోయబ్ అక్తర్ ఐనా నాకు ఒక్కటే. బౌలర్ గురించి ఆలోచించనని పేర్కొన్నాడు. ప్రపంచకప్ కు ఎలా సిద్దమౌతున్నరన్న ప్రశ్నకు సమాధానిమిస్తూ..ప్రత్యేకంగా ప్లాన్ ఏమీ లేదు. ఏ కప్ ఐనా ఒకటే. బాగా ఆడడమే ప్రధానమని తెలిపాడు.