విశాఖలో పోలీసుల, పౌ.హ.నేతల వార్!
విశాఖపట్నం: విశాఖ జిల్లా కోడేరులో శనివారం జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో వంతెల గోవర్ధన్ అనే కానిస్టేబుల్ చనిపోవడంతో పోలీసులు పౌరహక్కుల నాయకులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పౌరహక్కుల నేతలు స్పందించకపోవడమే అందుకు కారణం. గత కొద్ది నెలలుగా విశాఖ అడవులు నక్సల్స్-పోలీసుల ఎన్ కౌంటర్ లు, ప్రతి కౌంటర్ లతో దద్దరిల్లుతున్నాయి.
నక్సల్స్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన ప్రతిసారి పౌరహక్కుల సంఘాల నాయకులైన చలసాని ప్రసాద్, గిరిజన సాంసృతిక పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోళన చేశారు.
కానీ గత మూడు నెలల్లో నక్సల్స్ పోలీసు కానిస్టేబులు చిట్టిబాబు, రిటైర్డ్ ఎసిపి వీరారెడ్డి, సీలేర్ కానిస్టేబుల్ వెంకట్రావ్, తాజాగా గోవర్ధన్ లు నక్సల్స్ చేతిలో హతమైన పౌరహక్కుల నేతలు ఖండించలేదు. దీంతో పోలీసులు ఆదివారం విశాఖలో జరిగిన ఒక సమావేశంలో వారి వైఖరిని తీవ్రంగా ఖండించారు. నక్సలైట్లకు వీరు పరోక్షంగా మద్దతిస్తున్నారని ఆరోపించారు.