పల్నాడులో తెలంగాణవ్యూహం
గుంటూరు: తెలంగాణలోపకడ్బందీగా అమలు పరిచిన వార్ నిరోధకప్లాన్ ను పల్నాడులోనూ అమలుపర్చాలని పల్నాడు రేంజ్ పోలీసులుఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలోకరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించినట్లు ప్రస్తుతం గుంటూరులోనూ సద్భావనసదస్సులను నిర్వహిస్తున్నారు. ఇవి సత్పలితాలనుఇస్తున్నాయి. అని జిల్లా ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు.
సోమవారంపల్నాడులోని పనిచేస్తోన్న కొన్ని దళాలకుచెందిన నక్సలైట్లు ఎస్పీ ముందులొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లకు శిక్ష తగ్గించేలాన్యాయమూర్తులతో మాట్లాడతున్నామని ఆయన తెలిపారు.నక్సలైట్లకు పునరవాసాన్ని వెంటనే కల్పిస్తామనిఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం పల్నాడులోని దళితవాడలలో అవేర్ నెస్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నారు.యుక్తవయసులోని పిల్లలు దళాల వైపు మొగ్గు చూపకుండాతల్లితండ్రులకు పల్నాడు పోలీసులు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు.