వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు పాలనకు మురిసిన శౌరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనపై కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ మంత్రి అరుణ్‌శౌరి ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు నాయుడు పాలనను తాను బాగా ఇష్టపడుతానని ఆయన విలేకరులతో చెప్పారు.

అరుణ్‌ శౌరి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. శౌరి గౌరవార్థం చంద్రబాబు అల్పాహార విందు ఇచ్చారు. వీరిరువురి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. తాను ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన చెప్పారు. చంద్రబాబును ఎప్పుడు కలిసినా పాలనాంశాలపై చర్చల జరపడం తనకు అలవాటని ఆయన చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణపై, ప్రయివేటీకరణపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X