వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రానికి ఉదారంగా సాయం: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: కరువు సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి అన్నారు. మూడేళ్ల బిజెపి పాలన విజయోత్సవ సభలో ఆయన మంగళవారం మాట్లాడారు.

రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఆరు లక్షల టన్నుల బియ్యం అందజేసిందని, ఇప్పటి వరకు 274 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని ఆయన చెప్పారు. సిపిఐ జనజాగరణ యాత్ర ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X