క్రికెట్: చతికిలబడ్డ భారత్
హామిల్టన్:
న్యూజిలాండ్లో
జరిగిన
చివరి
ఏడో
వన్డే
క్రికెట్
మ్యాచ్లో
భారత్
ఓడిపోయింది.
గత
రెండు
మ్యాచ్ల
విజయం
స్ఫూర్తి
ఈ
మ్యాచ్లో
కనిపించలేదు.
భారత
బ్యాట్స్మెన్
న్యూజిలాండ్
బౌలర్ల
ధాటికి
నిలదొక్కుకోలేకపోయారు.
న్యూజిలాండ్ ఏడు వికెట్లతో తేడాతో భారత్పై సూనాయసంగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 122 పరుగులకు అలవుట్ అయింది. యువరాజ్ సింగ్, అనిల్ కుంబ్లే కాస్తా మెరుగైన ఆటను ప్రదర్శించడంతో భారత్ ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. 44 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో యువరాజ్, కుంబ్లే భారత్ పరువు కాపాడారు. యువరాజ్ 33 పరుగులు చేయగా అనిల్ కుంబ్లే 21 పరుగులు చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ను తొలుత భారత బౌలర్లు కష్టాల్లో పడేశారు. శ్రీనాథ్, జహీర్ ఖాన్లు వెంటవెంటనే మూడు వికెట్లు తీసుకున్నారు. శ్రీనాథ్ రెండు వికెట్లు తీసుకోగా, జహీర్ ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే ఫ్లెమింగ్ నిలకడగా ఆడి స్కోరు పెంచాడు. ఫ్లెమింగ్ అర్థ సెంచరీ చేశాడు. వన్డేల్లో శ్రీనాథ్ ఇప్పటి వరకు 299 వికెట్లు తీసుకున్నాడు. ఇంకో వికెట్ తీసుకుంటే 300 వికెట్లు తీసుకున్న ప్రపంచ బౌలర్ల క్లబ్లో చేరి వుండేవాడు. అయితే ఆ అవకాశం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ శ్రీనాథ్కు ఇవ్వలేదు.
మంగళవారంనాటి
విజయంతో
న్యూజిలాండ్
ఏడు
వన్డేల
సిరీస్ను
5-2
స్కోరుతో
గెల్చుకుంది.
మొదటి
నాలుగు
వన్డేల్లో
న్యూజిలాండ్
విజజం
సాధించి
సరీస్ను
గెల్చుకుంది.
అయితే
ఆ
తర్వాత
జరిగిన
రెండు
మ్యాచ్ల్లో
భారత్
విజయం
సాధించింది.