హుసేన్ పెయింటింగ్పై ఆశాభావం
హైదరాబాద్:
ప్రపంచ
ప్రఖ్యాత
చిత్రకారుడు
ఎం.ఎఫ్.
హుసేన్
పెయింటింగ్
దొరుకుతుందనే
ఆశాభావాన్ని
ఆసియా
సామాజిక
వేదిక
బాధ్యులంటున్నారు.
హైదరాబాద్లో
సామాజిక
వేదిక
సదస్సు
సందర్భంగా
ఏర్పాటయిన
పెయింటింగ్
ప్రదర్శనలో
హుసేన్
చిత్రాలను
కూడా
ఉంచారు.
అయితే
హుసేన్
చిత్రం
ఒకటి
కనిపించకుండా
పోయింది.
తన
చిత్రం
పోవడం
పట్ల
హుసేన్
సోమవారం
ఇక్కడ
నిర్వాహకులపై
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
దాని
విలువ
70
లక్షల
రూపాయల
వరకు
ఉంటుంది.
సామాజిక
వేదిక
సదస్సు
నిర్వాహకులను
కలవడానికి
కూడా
ఆయన
ఇష్టపడలేదు.
హుసేన్
ఆగ్రహాన్ని
తాము
అర్థం
చేసుకోగలమని
నిర్వాహకులన్నారు.
హుసేన్
చిత్రం
దొరుకుతుందనే
ఆశ
తమకు
ఉన్నదని
వారంటున్నారు.
అయితే
పెయింటింగ్
డబ్బులు
ఇవ్వడానికి
ప్రయత్నాలు
చేస్తామని
వారన్నారు.
విరాళాలు
సేకరించి
ఆ
డబ్బులు
ముట్టజెప్పుతామని
వారంటున్నారు.
పెయింటింగ్
మాయంపై
ఆబిడ్స్
పోలీసులు
కేసు
నమోదు
చేసుకొని
దర్యాప్తు
చేస్తున్నారు.