మహారాష్ట్ర కొత్త సిఎం షిండే?
ముంబాయి:
మహారాష్ట్ర
ముఖ్యమంత్రిగా
సుశీల్
కుమార్
షిండే
పేరు
ఖరారయింది.
మహారాష్ట్రలో
ముఖ్యమంత్రి
మార్పునకు
గత
కొద్ది
రోజులుగా
కాంగ్రెస్
అధిష్ఠానం
కసరత్తు
చేస్తోంది.
నాయకత్వ మార్పు సజావుగా జరిగేందుకు తగిన చర్యలన్నీ కాంగ్రెస్ తీసుకుంది. విలాస్రావు దేశ్ముఖ్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి షిండే ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. షిండే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే.
విలాస్రావు దేశ్ముఖ్ గురువారం ఉదయం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రతినిధులను సహ్యాద్రి అతిథి గృహంలో కలుసుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్, వాయలార్ రవిలతో తాను జరిపిన చర్చల వివరాలను వెల్లడించడానికి విలాస్ రావు దేశ్ముఖ్ నిరాకరించారు. షిండే మహారాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి అవుతారు.