అంబేడ్కర్ విగ్రహ తరలింపుపై చర్చలు
హైదరాబాద్:
రాజ్యాంగ
నిర్మాత
బాబా
సాహెబ్
అంబేడ్కర్
విగ్రహం
తరలింపు
వివాదాన్ని
పరిష్కరించడానికి
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చర్యలు
ప్రారంభించారు.
అంబేడ్కర్
విగ్రహ
పరిరక్షణ
కమిటీకి
చెందిన
కె.
నాగయ్య,
తదితరులతో
ఆయన
శనివారం
సమావేశమయ్యారు.
హైదరాబాద్లోని
బషీర్బాగ్లో
గల
అంబేడ్కర్
విగ్రహం
ఫ్లైఓవర్
నిర్మాణానికి
ఆటంకంగా
ఉండడంతో
దాన్ని
అక్కడి
నుంచి
తరలించడానికి
ప్రభుత్వం
ప్రయత్నించింది.
ఈ
ప్రయత్నాలను
దళితులు
తీవ్రంగా
ప్రతిఘటించారు.
దీంతో
వివాదం
చెలరేగింది.
అంబేడ్కర్
విగ్రహాన్ని
ట్యాంక్బండ్పై
సరైన
ప్రదేశంలో
ప్రతిష్ఠాపిస్తామని,
ఎంత
మంది
గుమికూడినా
ట్రాఫిక్కు
అంతరాయం
కలగని
ప్రదేశంలో
దీన్ని
ఉంచుతామని
లేదా
హైదరాబాద్
నగర
పాలక
సంస్థ
(ఎంసిహెచ్)
కార్యాలయం
ఎదుటనైనా
ప్రతిష్ఠాపిస్తామని
చంద్రబాబు
శనివారం
అంబేడ్కర్
విగ్రహ
పరిరక్షణ
కమిటీ
ప్రతినిధులకు
చెప్పారు.
దీనిపై
తమ
నిర్ణయాన్ని
కమిటీ
కొద్ది
రోజుల్లో
తెలియజేస్తుంది.