వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బస్సును ఢీకొన్న రైలు: ఒకరి మృతి
గుంటూరు: గంటూరు జిల్లా వినుకొండ సమీపంలో ఆర్టీసి బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొన్నది. ఒకరి మృతి చెందారు. ఈ ఘటనలో బస్సు ప్రయాణికులు 18 మంది గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. వీరిని వినుకొండ ఆస్పత్రికి తరలించారు.
దర్శి నుంచి వినుకొండ వస్తున్న ఆర్టీసి బస్సును లెవెల్ క్రాసింగ్ వద్ద నంద్యాల నుంచి గంటూరు వెళ్తున్న ప్యాసింజర్ రైలు వెనక నుంచి ఢీకొన్నది. ఈ సంఘటన శనివారం ఉదయం 7 గంటల 18 నిమిషాలకు జరిగింది. గేట్మన్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.
Comments
Story first published: Saturday, January 18, 2003, 23:53 [IST]