వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవానును కాల్చి చంపిన దొంగ

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురంలో ఒక అంతర్జాతీయ దోపిడీ దొంగ కానిస్టేబుల్‌ను హత్య చేసి పారిపోయాడు. పదిహేను రోజులుగా పోలీసు గెస్ట్‌హౌస్‌లో ఇంటరాగేషన్‌లో ఉన్న దొంగ తనకు కాపలా ఉన్న కానిస్టేబుల్‌ బాబా వలీను కాల్చి పారిపోయాడు.

ఈ సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో తిరుగాడుతున్న ఒక వ్యక్తిని ప్రశ్నించడానికి సమీపించగా ఆ వ్యక్తి కానిస్టేబుల్‌ రైఫిల్‌ను లాక్కుని కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. మరో కథనం ఇలా ఉంది- శుక్రవారం రాత్రి తనకు ఓ రాయి ఇవ్వాలని కస్టడీలో ఉన్న దొంగ కానిస్టేబుల్‌ను కోరాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ రాయితో దొంగ కానిస్టేబుల్‌ తలపై కొట్టాడు. కానిస్టేబుల్‌ స్పృహ తప్పి పడిపోగానే అతను రైఫిల్‌ను తీసుకుని కాల్పులు జరిపి అతడ్ని హతమార్చి పారిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X