వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జవానును కాల్చి చంపిన దొంగ
అనంతపురం:
అనంతపురంలో
ఒక
అంతర్జాతీయ
దోపిడీ
దొంగ
కానిస్టేబుల్ను
హత్య
చేసి
పారిపోయాడు.
పదిహేను
రోజులుగా
పోలీసు
గెస్ట్హౌస్లో
ఇంటరాగేషన్లో
ఉన్న
దొంగ
తనకు
కాపలా
ఉన్న
కానిస్టేబుల్
బాబా
వలీను
కాల్చి
పారిపోయాడు.
ఈ సంఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో తిరుగాడుతున్న ఒక వ్యక్తిని ప్రశ్నించడానికి సమీపించగా ఆ వ్యక్తి కానిస్టేబుల్ రైఫిల్ను లాక్కుని కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. మరో కథనం ఇలా ఉంది- శుక్రవారం రాత్రి తనకు ఓ రాయి ఇవ్వాలని కస్టడీలో ఉన్న దొంగ కానిస్టేబుల్ను కోరాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ రాయితో దొంగ కానిస్టేబుల్ తలపై కొట్టాడు. కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోగానే అతను రైఫిల్ను తీసుకుని కాల్పులు జరిపి అతడ్ని హతమార్చి పారిపోయాడు.
Comments
Story first published: Saturday, January 18, 2003, 23:53 [IST]