వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ వర్ధంతి: ఘన నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు ఎన్‌.టి. రామారావు 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకు శనివారం ఘనంగా నివాళులర్పించారు. రక్తదాన శిబిరాలు, ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దంపతులు, ఆయన మంత్రి వర్గ సహచరులు, స్పీకర్‌ కె. ప్రతిభాభారతి తదితరులు ఎన్టీఆర్‌ ఘాట్‌పై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సర్వమత ప్రార్థనలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవనంలో అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్‌ అభిమాన సంఘం తరఫున ఆయన పేద మహిళలకు కుట్టు మిషన్లు ప్రదానం చేశారు. అమరజ్యోతి ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X